కరోనాపై తెలుగు ఫిలిం ఛాంబర్ లో అత్యవసర సమావేశం

  • ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ ఆధ్వర్యంలో సమావేశం
  • కరోనా ప్రభావంపై చర్చ
  • థియేటర్ల మూసివేతపై నిర్ణయం తీసుకునే అవకాశం
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ ఉనికి వెల్లడవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ తెలుగు ఫిలిం చాంబర్ లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఫిలిం చాంబర్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు, 'మా' సభ్యులు హాజరయ్యారు.

కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, షూటింగ్ లు నిలిపివేయడం, థియేటర్ల మూసివేత, అవుట్ డోర్ షూటింగుల్లో తీసుకోవాల్సిన తప్పనిసరి జాగ్రత్తలపై ఈ సమావేశంలో చర్చించారు. కాగా, థియేటర్ల మూసివేతపై కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. వైరస్ వ్యాప్తికి థియేటర్లే ఎక్కువగా కారణమవుతాయని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనిపై కార్యాచరణను త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయి.

Corona Virus
Tollywood
Telugu Film Chamber
Hyderabad
MAA

More Telugu News